అమ్మవారి దర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..

by karthikeya |
అమ్మవారి దర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..
X

దిశ, ఆదిలాబాద్: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రలోని కేలాపూర్ శ్రీ జగదంబ మాత దర్శనానికి వెళ్లిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై తిరిగివస్తూ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా.. జైనథ్ మండలం పిప్పర్ వాడ టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే.. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వేగంగా ఢీకొన్నారు. ఈ దుర్ఘటనలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ కాలానికి చెందిన హర్షవర్ధన్ (17)అక్కడికక్కడే మరణించగా.. జైనత్ మండల కేంద్రానికి చెందిన నీరజ్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు నీరజ్‌ను హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్న నీరజ్ రెడ్డి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా విషయం తెలుసుకున్న మండల పోలీసులు హర్షవర్ధన్ మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. కాగా ప్రమాదానికి అతివేగమే కారణం అయి ఉండచ్చు అని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed