రేపు ఉదయం నిర్మల్ కు రాహుల్ గాంధీ రాక

by Disha Web Desk 11 |
రేపు ఉదయం నిర్మల్ కు రాహుల్ గాంధీ రాక
X

దిశ, ప్రతినిధి నిర్మల్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగే కాంగ్రెస్ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారని రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఆదిలాబాద్ ఇంచార్జ్ మంత్రి సీతక్క వెల్లడించారు. శుక్రవారం ఆమె నిర్మల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ తర్వాత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న సంకల్పంతో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కలెక్టరేట్ రోడ్డు లో ఉన్న క్రషర్ గ్రౌండ్ లో రాహుల్ గాంధీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

నిర్మల్, ముధోల్, బోత్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి 65 వేల మందిని రాహుల్ గాంధీ బహిరంగ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అందరూ ఒకటై పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు పాల్గొన్నారు.

Next Story

Most Viewed