MLA Gaddam Vinod : త్వరలోనే ఎల్లంపల్లి నీళ్లు బెల్లంపల్లికి తెస్తా..

by Aamani |
MLA Gaddam Vinod : త్వరలోనే ఎల్లంపల్లి నీళ్లు బెల్లంపల్లికి తెస్తా..
X

దిశ,బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రజల చిరకాల కోరిక ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని బెల్లంపల్లి కి తీసుకువస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ఇవాళ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన అధికారులతో కలిసి ఎల్లంపల్లి గోదావరి వాటర్ స్కీం పాయింట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లి వరకు వాటర్ సప్లై ఎలా చేయాలని అధికారులతో చర్చించారు. ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించడానికి ఎంతటి వ్యయాన్ని ఆయినా భరించడానికి వెనుకడనాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం అడ ప్రాజెక్ట్ నుంచి వస్తున్న తాగునీరు ఎంత మాత్రం ఆరోగ్య దాయకం కాదని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రజల కోరిక మేరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు మంచినీటినే బెల్లంపల్లి కి సరఫరా చేసేందుకు చర్యలు త్వరితగతిన చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.

గత పాలకులు ఏ మాత్రం నాణ్యతలేని అడ ప్రాజెక్ట్ నుంచి కలుషిత నీటిని బెల్లంపల్లి కి సప్లై చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమన్నారు. అందుకోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బెల్లంపల్లి కి సురక్షితమైన త్రాగునీటినీ సప్లై కి కృషి చేస్తానన్నారు. ప్రాజెక్ట్ వాటర్ వల్ల రోగాల బారిన పడుతున్నామని ప్రజలు స్వయంగా తనకు చెప్పారని అన్నారు. గోదావరి వాటర్ వచ్చే విధంగా కృషి చేస్తానని, బెల్లంపల్లి ప్రజలకు ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టు కుంటానన్నారు. ప్రజల కోరిక త్వరలోనే నెరవేబోతుందని ఎమ్మెల్యే గడ్డం హామీ ఇచ్చారు. సాధ్యమైనంత తొందరగా గోదావరి వాటర్ సప్లై కి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి స్థాయిలో శీఘ్రగతిన జరుగుతున్నాయని తెలిపారు.ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత త్వరగా గోదావరి వాటర్ సప్లై ను చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎల్లంపల్లి వాటర్ పాయింట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story