విద్యుత్ షాక్ తో రైతు మృతి..

by Kalyani |
విద్యుత్ షాక్ తో రైతు మృతి..
X

దిశ, పెగడపల్లి: పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన రైతు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించిన ఘటన విషాదం నింపింది. పెగడపల్లి మండలంలోని బతికేపల్లి గ్రామానికి చెందిన బొమ్మెల్ల అంజయ్య(55)అనే రైతు సాయంత్రం తన పొలం వద్దకు వెళ్ళి కరెంట్ మోటార్ ఆన్ చేసి వెళ్తుండగా పక్కనే ఉన్న ఇనుప పైపు తగిలి షాక్ తగలడంతో అక్కడిక్కడే మరణించాడు. మృతుడి భార్య ఐదు సంవత్సరాల క్రితం చనిపోగా ఒక కూతురు ఉంది. కూతురు నవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పంచనామా నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై రవి కిరణ్ తెలిపారు.

Advertisement

Next Story