TG: రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఏకగ్రీవం

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-27 15:39:53.0  )
TG: రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఏకగ్రీవం
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రం నుంచి పోటీలో మరెవరూ లేకపోవడంతో సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాసేపట్లో కాంగ్రెస్ నేత నిరంజన్‌ ధృవీకరణ పత్రం తీసుకోనున్నారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా రాజ్యస‌భ‌లో ఖాళీ అయిన మొత్తం 12 స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జరిగాయి. అస్సాం, బిహార్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్‌సభకు ఎన్నిక అయ్యారు. ఇక తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ రాజ్యస‌భ‌ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ అనివార్యమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి పోటీ చేసిన సింఘ్వీ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Advertisement

Next Story