కారు బైక్ ఢీ.. ఒకరి మృతి

by Rajesh |
కారు బైక్ ఢీ.. ఒకరి మృతి
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి దగ్గర గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మాక్లూర్ మండలం డీకంపల్లికి చెందిన ఎంపీటీసీ దేవన్న చిన్న కుమారుడు కాళ్ల గడ్డ రజినీకాంత్ (29) బైక్‌పై వెళుతుండగా ఆలూర్‌కు చెందిన కారు ఢీ కొంది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు బైక్ ఢీకొనగా డీకంపల్లికి చెందిన కాళ్ల గడ్డ రజనీకాంత్ మృతి చెందాడు. ఈ రోడ్డు ప్రమాద సంఘటన విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి వెళ్లి ఆర్మూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. శుక్రవారం మాక్లూర్ మండలంలోని డికంపల్లి గ్రామంలో రజినీకాంత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story