- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలంగాణలో భారీ వర్షాలకు 9 మంది మృతి
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో నిన్నటి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు, భారీ వరదలకు 9 మంది చనిపోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రకటించారు. రాష్ట్రమంతటా కురుస్తున్న కుండపోత వానలకు వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులన్నీ చెరువులయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. సూర్యాపేట జిల్లాలోని రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు గ్రామం అయిన రామాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏపీకి తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ విజయవాడ మధ్య బస్సు సర్వీసులను రూటు మార్చి నడిపిస్తున్నారు. కాగా వివిధ ప్రాంతాల్లో వరదల్లో కొట్టుకుపోయి మరణించిన వారి సంఖ్య అధికారిక సమాచారం ప్రకారం 9 అని మంత్రి పేర్కొన్నారు. ఇక తీవ్ర ఆందోళనకు గురి చేసిన ఖమ్మం జిల్లా మున్నేరు వాగులో చిక్కుకున్న 9 మందిని నేవీ హెలికాప్టర్ల ద్వారా రక్షించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.