ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మొత్తం 24 మంది మావోయిస్టులు మృతి

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-04 13:57:10.0  )
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మొత్తం 24 మంది మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్:‌ ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌(Encounter)లో మొత్తం 24 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్పీ కిరణ్‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌ నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. అబూజ్‌మడ్‌ ఫారెస్ట్‌లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించారు. దీంతో మావోయిస్టులు అప్రమత్తం కావడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 24 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలిలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed