ఆ చట్టంపై సుప్రీం స్టే….

by  |
ఆ చట్టంపై సుప్రీం స్టే….
X

దిశ వెబ్ డెస్క్:
మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. విద్య, ఉద్యోగాల్లో మరాఠీలకు రిజర్వేషన్లు కల్చించే మహారాష్ట్ర చట్టం-2018 అమలుపై బుధవారం సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఈ దశలో ఉద్యోగాలు, కాలేజీల అడ్మిషన్లలో మరాఠీల కోటాను వర్తింప జేయలేమని జస్టిస్ నాగేశ్వర రావు, హేమంత్ గుప్తా, రవీంద్ర భట్ లతో కూడిన త్రి సభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ ను మరాఠీల కోటా దాటి పోయిందన్నారు. కాగా విద్యా సంస్థల్లో 16 శాతం రిజర్వేషన్లను మరాఠిలకు కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసింది. కాగా దీనిపై ముంబై హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది. రిజర్వేషన్ కోటా పరిమితిని పెంచడం సమర్థనీయం కాదని హైకోర్టు తెలిపింది. దీంతో ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని ఈ నెల 26న సుప్రీం కోర్టును మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది.


Next Story

Most Viewed