చేనేతపై GST వేసిన ఏకైక ప్రధాని మోడీనే: మంత్రి పొన్నం

by Disha Web Desk 19 |
చేనేతపై GST వేసిన ఏకైక ప్రధాని మోడీనే: మంత్రి పొన్నం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఏదైనా శవ రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్లకు క్లస్టర్ అడిగితే కేంద్రం ఇవ్వలేదని.. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం పదేళ్లు అధికారంలోకి ఉన్నా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలేనని ఆరోపించారు. చేనేతపై జీఎస్టీ వేసిన ఏకైక ప్రధాని మోడీనేని అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల కార్మికుల జీవితాలను నిజంగా బాగు చేసి ఉంటే ఈ పరిస్థితి కేవలం నాలుగు నెలలకే కూలిపోవద్దు కదా అని ప్రశ్నించారు. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీయొద్దని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులు ఎవరూ అధైర్య పడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దని.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.



Next Story