ఫేమ్, పవర్ వచ్చాక కోహ్లీ మారిపోయాడు : విరాట్‌పై అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

by Harish |
ఫేమ్, పవర్ వచ్చాక కోహ్లీ మారిపోయాడు : విరాట్‌పై అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై భారత సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అమిత్ మిశ్రా.. ఫేమ్, పవర్ వచ్చాక విరాట్ చాలా మారిపోయాడని వ్యాఖ్యానించాడు. ‘ నేను అబద్ధం చెప్పను. ఒక క్రికెటర్‌గా అతన్ని ఎంతో గౌరవిస్తాను. అతను చాలా మారిపోయాడు. మేము మాట్లాడుకోవడం దాదాపుగా మానేశాం. ఫేమ్, పవర్ రాగానే ఎవరైనా ఏదో ప్రయోజనం ఆశించే మన దగ్గరకు వస్తారని కొంత మంది భావిస్తారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. చీకు(కోహ్లీ ముద్దుపేరు) నాకు 14 ఏళ్ల వయసు నుంచి తెలుసు. నాకు తెలిసిన చీకుకు, విరాట్ కోహ్లీకా చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఎప్పుడు కలిసినా నాకు చాలా గౌరవం ఇస్తాడు. కానీ అది స్పష్టంగా లేదు.’ అని తెలిపాడు.

అంతటితో ఆగని అమిత్ మిశ్రా.. రోహిత్, విరాట్ మధ్య ఎంతో తేడా ఉందని చెప్పాడు. కెరీర్ మొదట్లో రోహిత్ ఎలా ఉన్నాడో ఇప్పటికీ అతను అలాగే ఉన్నాడన్నాడు. ‘కోహ్లీ, రోహిత్ స్వభావాలు వేరు. రోహిత్ గురించి ఒక్క మంచి విషయం చెప్పాలంటే.. నేను రోహిత్‌ను మొదటిసారి కలిసినప్పుడు ఎలాఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. కాబట్టి, అలాంటి వారితో మీరు స్నేహంగా ఉంటారా? లేదా పరిస్థితులను బట్టే వారితో ఉంటారా?.’ అని చెప్పుకొచ్చాడు.

యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌పై కూడా అమిత్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాడిగా గిల్ అద్భుతమైన ఆటగాడని, అయితే, కెప్టెన్సీ చేయడం మాత్రం రాదన్నాడు. భారత జట్టులో ఉన్నాడన్న కారణంతో ఐపీఎల్‌లో అతన్ని కెప్టెన్‌ను చేశారని వ్యాఖ్యానించాడు. కాగా, గిల్ నాయకత్వంలో భారత జట్టు జింబాబ్వేపై టీ20 సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed