పడిపోతున్న పాక్ క్రికెట్ బోర్డు.. సమోసా ధరకే మ్యాచ్ టికెట్స్

by M.Rajitha |
పడిపోతున్న పాక్ క్రికెట్ బోర్డు.. సమోసా ధరకే మ్యాచ్ టికెట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రేక్షకులు వస్తారో రారో అన్న భయంతో మ్యాచ్ టికెట్ల రేటును భారీగా తగ్గించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్. పాక్-బంగ్లా మధ్య జరగనున్న రెండు మ్యాచ్ టెస్టు సిరీస్ లకు సంబంధించిన టికెట్ల విక్రయాని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఆగస్ట్ 12న తన వెబ్సైట్ లో ఉంచింది. అయితే ఈ టికెట్స్ ధరలను చూసిన పాక్ క్రికెట్ ప్రియులు ఓవైపు సంబరపడిపోతూనే, మరోవైపు షాక్ కు గురయ్యారు. జనరల్ టికెట్స్ ధరలు కేవలం 15 రూపాయలు మాత్రమే ఉండటం ఇందుకు కారణం. బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ సిరీస్ లా మ్యాచ్ లో మొదటిది రావల్పిండి వేదికగా జరగనుండగా.. జనరల్ టికెట్స్ రేట్ రూ.60 ఉండగా, రెండో సిరీస్ కరాచీలో జరగనుంది. దీని ధరలు కేవలం రూ.15 మాత్రమే ఉండటం అందర్నీ షాకింగ్ కు గురి చేసింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత పాక్ లో జరగబోయే మొదటి సిరీస్ ఇది. ప్రేక్షకులు వస్తారో రారో అనే భయంతోనే టికెట్ ధరలు భారీగా తగ్గించినట్టు బోర్డు సభ్యులు ఒకరు మీడియాకు వెల్లడించారు. కాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024 కు పెద్దగా ప్రేక్షకులు రాక, ఖాళీ స్టేడియాలు దర్శనమిచ్చిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed