- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
నిశాను కావాలనే గాయపరిచారు.. భారత కోచ్ వీరేంద్ర దహియా సంచలన ఆరోపణలు
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ నిశా దహియా క్వార్టర్స్లో నిష్ర్కమించిన విషయం తెలిసిందే. 68 కేజీల కేటగిరీలో పాల్గొన్న ఆమె క్వార్టర్ ఫైనల్ బౌట్లో నార్త్ కొరియాకు చెందిన పాక్ సోల్ గమ్ చేతిలో 10-8 తేడాతో పరాజయం పాలైంది. అయితే, మొదట నిశానే ఆధిపత్యం ప్రదర్శించగా.. ఆమె చేతి వేళ్లకు గాయమవడంతో అంతా తారుమారైంది. నొప్పితోనే పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. బౌట్ అనంతరం భారత జట్టు కోచ్ వీరేంద్ర దహియా కీలక వ్యాఖ్యలు చేశాడు.
నిశాను నార్త్ కొరియా రెజ్లర్ సోల్ గమ్ ఉద్దేశపూర్వకంగా గాయపరిచిందని ఆరోపించాడు. ‘100 శాతం ఉద్దేశపూర్వకంగా ఆమెను గాయపరిచారు. సోల్గమ్కు కొరియన్ కార్నర్ నుంచి సూచన చేయడం మేము చూశాం. నిశా నుంచి పతకాన్ని ఎత్తుకెళ్లారు. ఎటాక్, కౌంటర్ ఎటాక్, డిఫెన్స్లో నిశా ఆధిపత్యం కనిపించింది. అదే రెజ్లర్ను ఏషియన్ క్వాలిఫియర్లో నిశా ఓడించింది. నిశా ఓడిపోయే చాన్సే లేదు.’ అని చెప్పాడు. నిశా భుజానికి గాయంపై తీవ్ర గాయమైందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) తెలిపింది.