- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Neeraj Chopra: డైమండ్ లీగ్పై నీరజ్ ఫోకస్..
దిశ, వెబ్డెస్క్: ఒలంపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరోసారి డైమండ్ లీగ్లో సత్తా చాటాలని కసరత్తలు చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఈ స్టార్ ప్లేయర్.. స్విట్జర్లాండ్ వేదికగా శుక్రవారం ప్రారంభం కానున్న డైమండ్ లీగ్ లుసానె టోర్నీలో బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది దోహాలో జరిగిన తొలి డైమండ్ లీగ్ టోర్నీలో 88.67 మీటర్లకు జావెలిన్ను విసిరి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత గాయంతో ఎఫ్బీకే క్రీడలు (నెదర్లాండ్స్), పావో నూర్మి ఈవెంట్ (ఫిన్లాండ్)లకు దూరమయ్యాడు. అయితే ఈ సీజన్లో ఎలాగైనా 90 మీటర్ల లక్ష్యాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న నీరజ్కు ఇప్పుడు లుసానె టోర్నీ మరో అవకాశాన్ని ఇస్తోంది.
నీరజ్ తన కెరీర్లో అత్యుత్తమంగా 2022 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 89.94 మీటర్ల దూరానికి జావెలిన్ను విసిరి రికార్డుకెక్కాడు. అభినవ్ బింద్రా తర్వాత, వ్యక్తిగత ఆటల విభాగంలో భారత్కు ఒలంపిక్స్లో బంగారు పతకం అందించాడు నీరజ్ చోప్రా. ఇటీవలే ఓ అరుదైన రికార్డును సైతం తన పేరిట లిఖించుకున్నాడు. పురుషుల జావెలిన్ త్రోలో వరల్డ్ నెంబర్ ర్యాంకింగ్ని దక్కించుకున్న తొలి ఇండియన్ అథ్లెట్గా చరిత్రకెక్కాడు. మరోవైపు దోహా డైమండ్ లీగ్లో తొలి స్థానంలో నిలిచి 8 పాయింట్లు సాధించి, స్విస్ లీగ్లో అడుగుపెట్టనున్నాడు.