అది సమిష్టి నిర్ణయం.. రాయుడి సెలెక్షన్‌ను నేను అడ్డుకోలేదు : MSK Prasad

by Vinod kumar |
అది సమిష్టి నిర్ణయం.. రాయుడి సెలెక్షన్‌ను నేను అడ్డుకోలేదు : MSK Prasad
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా బ్యాటర్, చెన్నై లెజెండ్ అంబటి రాయుడు ఇటీవలే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అయితే ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2019 వరల్డ్ కప్‌లో తనను ఎంపిక చేయకపోవడం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఆంధ్రకు ఆడేప్పుడు ఎమ్మెస్కే ప్రసాద్‌తో విభేదాలు వచ్చినట్లు చెప్పాడు. దీనిపై బీసీసీఐ మాజీ సెలక్టర్ చీఫ్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ స్పందించాడు.

'సెలెక్షన్ కమిటీల మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. వారితోపాటు కెప్టెన్ కూడా ఉంటాడు. ఎవరో ఒక్కరి నిర్ణయాన్ని అంతా ఒప్పుకుంటారా? లేక అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారా?' అని ప్రశ్నించాడు. రాయుడును ఎంపిక చేయకపోవడం అనేది సెలెక్షన్ కమిటీ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed