దాని గురించి అడిగేవాళ్లకు నా సమాధానం ఇదే.. ట్వీట్ చేసిన మను బాకర్

by Harish |
దాని గురించి అడిగేవాళ్లకు నా సమాధానం ఇదే.. ట్వీట్ చేసిన మను బాకర్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. విశ్వక్రీడల అనంతరం ఆమె షూటింగ్‌ నుంచి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంది. పలు ఈవెంట్లకు హాజరవడంతోపాటు ఇంటర్వ్యూలతో ఆమె బిజీ అయిపోయింది. అయితే, ఎక్కడికి వెళ్లినా ఆమెను ‘పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచారు. మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి?’ అని అడుగుతున్నారట. దీనికి మను శుక్రవారం ఎక్స్ వేదికగా సమాధానమిచ్చింది. ఎలాంటి మార్పు రాలేదని చెప్పింది. ‘రెండు పతకాలు గెలిచిన తర్వాత మీ జీవితంలో ఏం మార్పులు వచ్చాయని అడుగుతున్న వారిందరికీ ఒక్కటే చెబుతున్నా.. ఏం మారలేదు. నేను అదే మను బాకర్‌ని. విశ్రాంతిని ఆస్వాదిస్తున్నా. నవంబర్‌లో షూటింగ్ రేంజ్‌లో అడుగుపెడతా. తిరిగి ట్రైనింగ్ మొదలుపెడతా.’ అని రాసుకొచ్చింది. కాగా, ఒలింపిక్స్‌లో అదిరే ప్రదర్శన తర్వాత మను బాకర్ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. దాదాపు 5-6 రెట్లు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం.. ఒలింపిక్స్‌కు ముందు ఆమె ఎండార్స్‌మెంట్ డీల్ విలువ రూ. 25 లక్షలు ఉంటే ఇప్పుడు రూ. 1.5 కోట్లకు పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed