Macau Open 2024 : సెమీస్‌లో గాయత్రి జోడీ ఓటమి

by Harish |
Macau Open 2024 : సెమీస్‌లో గాయత్రి జోడీ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ పోరాటం ముగిసింది. సెమీస్‌లో ఈ జంట పరాజయం పాలైంది. శనివారం జరిగిన ఉమెన్స్ డబుల్స్ సెమీస్‌లో గాయత్రి జోడీ 17-21, 21-16, 10-21 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హ్సీ పీ షాన్-హంగ్ ఎన్ ట్జు చేతిలో ఓడిపోయింది. గంటపాటు సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థులకు గాయత్రి జోడీ గట్టిపోటీనే ఇచ్చినప్పటికీ కీలక సమయాల్లో పట్టు బిగించలేకపోయింది. తొలి గేమ్‌‌లో 16-16తో స్కోరును సమం చేసి పుంజుకున్నట్టే కనిపించినా ఆ జోరును కొనసాగించలేక తొలి గేమ్‌ను కోల్పోయింది. అయితే, రెండో గేమ్‌లో మాత్రం గాయత్రి, ట్రీసా జాలీ దూకుడు పెంచారు. ప్రత్యర్థి ద్వయం నుంచి గట్టిపోటీ ఎదుర్కొని మరి రెండో గేమ్‌ను నెగ్గి స్కోరును 1-1తో సమం చేశారు. కానీ, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తేలిపోయి మ్యాచ్‌ను సమర్పించుకున్నారు. గాయత్రి జోడీ నిష్ర్కమణతో టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed