- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
క్వార్టర్స్లో లోకేశ్ ఓటమి
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : తైవాన్లో జరుగుతున్న కయోహ్సియుంగ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. టోర్నీలో మిగిలిన ఏకైక ఆటగాడు, తెలంగాణ కుర్రాడు కలగొట్ల లోకేశ్ రెడ్డి జోరుకు క్వార్టర్స్లో బ్రేక్ పడింది. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో లోకేశ్ 16-21, 19-21 తేడాతో తన కంటే మెరుగైన ర్యాంకర్, మలేషియా ఆటగాడు చీమ్ జూన్ వీ చేతిలో పోరాడి ఓడిపోయాడు. 32 నిమిషాలపాటు సాగిన మ్యాచ్లో లోకేశ్ ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చాడు. అయితే, కీలక సమయాల్లో తప్పిదాలతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తొలి గేమ్తో పోలిస్తే రెండో గేమ్లో దూకుడుగా ఆడిన అతను ఆ గేమ్ను నెగ్గేలా కనిపించాడు. కానీ, ఆఖర్లో తడబడి గేమ్తోపాటు మ్యాచ్నూ కోల్పోయాడు.
Advertisement
Next Story