'క్రికెట్‌కే ఎక్కువ గుర్తింపు రావడం బాధగా ఉంది: సైనా నెహ్వాల్

by Mahesh |
క్రికెట్‌కే ఎక్కువ గుర్తింపు రావడం బాధగా ఉంది: సైనా నెహ్వాల్
X

దిశ, వెబ్ డెస్క్: భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన 17 సంవత్సరాల తర్వాత టీ20 చాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. అలాగే ముంబైలో భారీ రోడ్ షో కూడా నిర్వహించారు. దీనిపై సైనా నెహ్వాల్ స్పందిస్తూ.. 'క్రికెట్‌కు ఎక్కువ శ్రద్ధ రావడం నాకు బాధగా ఉందని అన్నారు. ఇతర క్రీడలతో పోలిస్తే క్రికెట్‌పై అసమానమైన శ్రద్ధ చూపడం పట్ల సైనా నెహ్వాల్ తన ఆందోళనను వ్యక్తం చేసింది.

క్రికెట్ కంటే ఇతర విభాగాలలో అథ్లెట్లు "శారీరకంగా చాలా కఠినంగా" ఉంటారని, ఇలాంటి గుర్తింపు, మద్దతుకు తాము కూడా అర్హులమని ఆమె నొక్కి చెప్పింది. క్రీడల్లో సైనా ఏమి చేస్తుందో, రెజ్లర్లు, బాక్సర్లు ఏమి చేస్తున్నారో, నీరజ్ చోప్రా ఏమి చేస్తున్నారో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. "నేను క్రికెట్ గురించి చెడుగా మాట్లాడినా అది అందరికీ నచ్చుతుంది. నేను దానిని ప్రేమిస్తున్నాను, కానీ మీరు ఇతర క్రీడలపై కూడా అలాంటి శ్రద్ధ పెట్టాలి, లేకపోతే, భారతదేశం క్రీడా దేశంగా ఎలా మారుతుందని ఆమె ఓ చానల్ ఇంటర్వ్యూలో దేశ ప్రజలను ప్రశ్నించారు.



Next Story