- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
IND vs PAK: 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం! 34 ఓవర్ల మ్యాచ్
దిశ, వెబ్డెస్క్: ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా భారత్-పాక్ల మధ్య ఇవాళ జరుగుతున్న సూపర్-4 మ్యాచ్ వర్షం కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయగా.. 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈ దశలో 5 గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రి 7 గంటల సమయంలో కాస్త ఎడతెరిపినిచ్చినప్పటికీ మైదానం మొత్తం చిత్తడిగా ఉండటంతో మరి కాసేపు (రాత్రి 7:30 గంటల వరకు) వెయిట్ చేయాలని ఇరు జట్ల కెప్టెన్లు రిఫరీని కోరారు. అయితే 7:30 నిమిషాలకు స్టేడియాన్ని పరిశీలించిన అంపైర్లు.. మ్యాచ్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. స్టేడియంలో అక్కడక్కడ ఇంకా తడిగా ఉండటమే ఇందుకు కారణం.8.30 నిమిషాలకు మరొకసారి అంపైర్లు మైదానాన్ని పరిశీలించనున్నారు. మ్యాచ్ 9 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే మ్యాచ్ను 34 ఓవర్లకు కుదించే ఛాన్స్ ఉంది. స్టేడియంలో తడి లేకుండా చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఒకవేళ ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్కు దిగే అవకాశం లేకుండా డక్వర్త్ లూయిస్ పద్థతి ప్రకారం.. పాక్కు టార్గెట్ నిర్ధేశించాల్సి వస్తే పరిస్థితి ఇలా ఉంటుంది. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరగాలంటే కటాఫ్ టైమ్ రాత్రి 10:30 గంటలు. దీని తర్వాత మ్యాచ్ సాధ్యపడే అవకాశం లేదు. మ్యాచ్ రిజర్వ్ డే అయిన రేపు (సెప్టెంబర్ 11) నిర్వహించాల్సి ఉంటుంది. భారత్ తిరిగి బ్యాటింగ్కు దిగకుండా 20 ఓవర్ల మ్యాచ్ అయితే (DLS ప్రకారం) పాక్ లక్ష్యం 181 పరుగులుగా ఉంటుంది.