రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by Mahesh |
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
X

దిశ, గీసుగొండ: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని డీసీఎం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద సంఘటన గొర్రెకుంట వద్ద చోటు చేసుకుంది. గీసుగొండ ఎస్ఐ కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గుల్లపల్లి అఖిల్ 24 తన ద్విచక్ర వాహనంపై పనిమీద వరంగల్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో 16 వ డివిజన్ గొర్రెకుంట వద్ద అతని వాహనాన్ని డీసీఎం ఢీకొనడంతో తలకు బలమైన గాయం అయింది. దీంతో బైక్ పై వెళ్తున్న అఖిల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎ.మహేందర్ తెలిపారు. పండుగ పూట యువకుడు మృతి చెందడంతో ఉప్పరపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed