- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Home > స్పోర్ట్స్ > IND vs ENG: టీమిండియా ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లోనే తొలి రెండు టెస్టులు..
IND vs ENG: టీమిండియా ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లోనే తొలి రెండు టెస్టులు..
by Vinod kumar |
X
దిశ, వెబ్డెస్క్: వరల్డ్ కప్ 2023 తర్వాత టీమిండియా అతిపెద్ద పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. జనవరి 25, 2024 నుంచి.. భారత్ vs ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-2025లో భాగంగా ఉంటుంది. ఇందులో హైదరాబాద్ (జనవరి 25 నుంచి 29 వరకు)లో తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అనంతరం విశాఖపట్నం (ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు) రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అంటే తొలి రెండు టెస్ట్ మ్యాచ్లు తెలుగు రాష్ట్రాల్లోనే జరగనున్నాయి.
దీంతో తెలుగు ఫ్యాన్స్కు గుడ్న్యూస్ అందినట్లైంది. ఇక మూడో టెస్ట్ మ్యాచ్ రాజ్కోట్ (ఫిబ్రవరి 15-19)లో, నాలుగో టెస్ట్ మ్యాచ్ రాంచీ (ఫిబ్రవరి 23-27)లో, ధర్మశాల (మార్చి 7-11)లో ఐదవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దేశవాళీ సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story