భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్ టీమ్ ప్రకటన

by Vinod kumar |
భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్ టీమ్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: సొంతగడ్డపై టీమిండియాతో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనున్న వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జూలై 12 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ కోసం 18 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ) శుక్రవారం వెల్లడించింది. వెటరన్ బ్యాటర్ క్రెగ్ బ్రాత్‌వైట్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విండీస్ బోర్డు.. మొత్తం యువ ఆటగాళ్లకే అవకాశం కల్పించింది.

ప్రస్తుతం వెస్టిండీస్‌ ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లో ఆడుతుండటంతో సీనియర్ ఆటగాళ్లంతా ఈ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యారు. జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కేల్ మేయర్స్ స్థానంలో కొత్త ఆటగాళ్లు కావెమ్‌ హోడ్గే, అలిక్ అతానాజ్, జైయిర్ మెక్‌అలిస్టర్‌‌లు అవకాశం అందుకున్నారు.

ఇక వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌లకు టీమిండియా 16 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటు వేసిన భారత సెలెక్టర్లు యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్‌లకు అవకాశం కల్పించింది.

వెస్టిండీస్ టీమ్:

క్రెగ్ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్), అలిక్‌ అతానాజ్, బ్లాక్‌వుడ్, బోనెర్, టాగెనరైన్ చంద్రపాల్, రహ్‌కీమ్‌ చంద్రపాల్, జాషువా సిల్వా, గాబ్రియల్, కావెమ్ హోడ్గే, అకీమ్ జోర్డాన్, జైయర్, కిర్క్‌ మెకెన్జీ, మిండ్లే, అండర్సన్‌ ఫిలిప్‌, రీఫెర్, కీమర్‌ రోచ్, జయ్‌దేన్‌ సీల్స్‌, వారికన్

Advertisement

Next Story

Most Viewed