- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
IND vs WI 1st Test: విండీస్తో టెస్టు పోరుకు భారత్ రె'ఢీ'.. టాస్ గెలిచిన విండీస్..
దిశ, వెబ్డెస్క్: డొమినికా వేదికగా విండీస్-భారత్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తరఫున ఇషాన్ కిషన్ టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయమైంది. ఈ మ్యాచ్లో అతడు వికెట్ కీపర్గా వ్యవహరించనుండగా.. తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్కు మొండిచేయి ఎదురైంది. చివరి సారిగా 2019లో విండీస్ పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు సిద్ధమైంది. గతేడాది భారత్కు విండీస్ వచ్చినప్పటికీ టెస్టు సిరీస్ మాత్రం ఆడలేదు.
అయితే ఈ సారి రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో యువ ప్లేయర్ యశస్వి జైశ్వాల్ టెస్ట్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేసి జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్.. టెస్ట్ అరంగేట్రం చేయబోతున్నాడు. వెస్టిండీస్తో ప్రారంభం కానున్న మొదటి టెస్టులో అతడు ఓపెనర్గా దిగబోతున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దీంతో హిట్ మ్యాన్-యశస్వి కలిసి ఓపెనర్లుగా బరిలో దిగబోతున్నారు.
డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో స్టాండ్ బై ప్లేయర్గా ఉన్న యశస్వికి.. అప్పుడు ఆడే ఛాన్స్ దక్కలేదు. కానీ, ఈ సారి విండీస్ పర్యటనకు ఎంపికవ్వడంతో పాటు మొదటి టెస్టులోనే ఆడే అవకాశం దక్కించుకోవడం విశేషం. 2021లో ఆస్ట్రేలియాపై టెస్ట్ అరంగేట్రం చేసిన శుభమన్గిల్.. అప్పటి నుంచి ఓపెనర్గానే బరిలో దిగుతున్నాడు. అయితే ఈ సారి యశస్వి ఓపెనర్గా ఎంట్రీ ఇవ్వడంతో.. గిల్మూడో స్థానంలో ఆడనున్నట్లు హిట్మ్యాన్పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్నట్లు రోహిత్ చెప్పాడు.
భారత్పైచేయి..
గత 21 ఏళ్లుగా ఇరు దేశాల జట్ల మధ్య మొత్తం ఎనిమిది సిరీస్లు జరిగాయి. వీటన్నింటిలో టీమ్ఇండియానే విజయం సాధించడం విశేషం. చివరిసారిగా భారత్పై వెస్టిండీస్ 2001/2002 సీజన్లో టెస్టు సిరీస్ను గెలుచుకుంది. ఆ తర్వాత ఒక్కసారి కూడా విండీస్..భారత్పై పైచేయి సాధించలేకపోయింది. ఇప్పటివరకు ఇరు జట్లూ కలిపి మొత్తం 98 టెస్టు మ్యాచ్లు ఆడగా.. వీటిల్లో భారత్ (22), విండీస్ (30) విజయాలతో ఆధిపత్యంలో ఉంది. కరేబియన్ మైదానంలో 51 మ్యాచుల్లో తలపడగా.. విండీస్ 16 విజయాలు, భారత్ 9 విజయాలను నమోదు చేసింది. మరో 26 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. సిరీస్ల గణంకాల ప్రకారం.. విండీస్-భారత్ జట్ల మధ్య 24 టెస్ట్ సిరీస్లు జరిగాయి. ఇందులో 12 సిరీస్లను వెస్టిండీస్ సొంతం చేసుకోగా.. భారత్ 10 సిరీస్లను గెలుచుకుంది. మరో రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (w), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI):
క్రైగ్ బ్రాత్వైట్ (సి), టాగెనరైన్ చందర్పాల్, రేమన్ రీఫర్, జెర్మైన్ బ్లాక్వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (w), జాసన్ హోల్డర్, రహ్కీమ్ కార్న్వాల్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్
Two debutants for #TeamIndia.
— BCCI (@BCCI) July 12, 2023
A look at our Playing XI for the 1st Test.
Live - https://t.co/FWI05P59cL… #WIvIND pic.twitter.com/dArjNP2o87