నిరసనలతో మార్మోగిన ప్రజాభిప్రాయ సేకరణ..

by Sumithra |
నిరసనలతో మార్మోగిన ప్రజాభిప్రాయ సేకరణ..
X

దిశ, రామన్నపేట : రామన్నపేట అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణలో నల్ల జెండాలు, ప్లకార్డులతో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య కంపెనీ నాకొద్దంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అంబుజా గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రమాదకరమైన ఫ్యాక్టరీ దూర ప్రాంతాల్లో వేసుకోవాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. మా ప్రాంతానికి అన్యాయం చేయొద్దని అంటూ ప్రజలు కోరుకున్నారు.

Advertisement

Next Story