- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Ajit Pawar: బారామతి నుంచి అజిత్ పవార్ పోటీ.. ఎన్సీపీ తొలి జాబితా రిలీజ్
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాను నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అజిత్ పవార్ వర్గం బుధవారం విడుదల చేసింది. 38 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. డిప్యూటీ సీఎం, పార్టీ చీఫ్ అజిత్ పవార్ బారామతి నుంచి బరిలో దిగనున్నారు. యెవ్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత ఛగన్ భుజ్బల్, అంబేగావ్ స్థానం నుంచి దిలీప్ వాల్సే-పాటిల్ పోటీ చేయనున్నారు. అలాగే పరాలి నుంచి ధనంజయ్ ముండే, కాగల్లో హసన్ ముష్రిఫ్, దిండోరి నుండి నరహరి జిర్వాల్లకు అవకాశం దక్కింది. కాగా, బారామతి సీటు పవార్కు కంచు కోటగా ఉంది. ఇక్కడి నుంచి అజిత్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే గత లోక్ సభ ఎన్నికల్లో బారామతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అజిత్ భార్య సునేత్ర పవార్ పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. దీంతో ఈ సెగ్మెంట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, రాష్ట్రంలోని మహాయుతి కూటమిలో ఎన్సీపీ భాగస్వామిగా ఉంది. ఇప్పటి వరకు ఈ కూటమిలో ఉన్న బీజేపీ 99, శివసేన 45, ఎన్సీపీ 38 మంది అభ్యర్థులను ప్రకటించాయి.