29న నిజామాబాద్ కు బీసీ కమిషన్ బృందం

by Naveena |   ( Updated:2024-10-23 11:09:39.0  )
29న నిజామాబాద్ కు బీసీ కమిషన్ బృందం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో చేపట్టబోయే కులాల గణనపై ఆయా పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటైన తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుల బృందం ఈ నెల 29న నిజామాబాద్ కు రానుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈనెల 29 న నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కులగణనపై కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో.. సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, బీసీ వెల్ఫేర్ కమిషనర్లతో బృందం ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని వెల్లడించారు. ఆయా కులాల స్థితిగతులపై కమిషన్ బృందానికి ప్రజలు, వివిధ సంఘాల వారు, రాజకీయ పార్టీల బాధ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని ప్రకటనలో కలెక్టర్ సూచించారు.

Advertisement

Next Story