వయానాడ్ లో ప్రియాంక గాంధీ నామినేషన్

by Y. Venkata Narasimha Reddy |
వయానాడ్ లో ప్రియాంక గాంధీ నామినేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయానాడ్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రియాంకా గాంధీ తన నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. నామినేషన్ కు ముందు వయానాడ్ కల్ఫేటాలో మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రియాంకా గాంధీ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్న ఖర్గే సహా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.

రాహుగాంధీ రాయ్ బరేలీ, వయానాడ్ లో రెండుచోట్ల లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందగా, ఆయన వయానాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. రాహుల్ రాజీనామాతో వయానాడ్ బరిలో ప్రియాంకా గాంధీ బరిలోకి దిగుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆమెకు ఇదే తొలిసారి. ప్రియాంక గాంధీకి యూడీఎఫ్ మద్దతునిస్తుంది. వయానాడ్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికలో భాగంగా నవంబర్ 13న పోలింగ్, 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఎల్ డీ ఎఫ్ బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా సత్యన్ మొఖేరీ, బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్ పోటీ చేస్తున్నారు.

Advertisement

Next Story