Supriya sule: ఢిల్లీకి వెళ్లని అజిత్ దాదా మాత్రమే తెలుసు.. సుప్రియా సూలే

by vinod kumar |   ( Updated:2024-10-23 07:53:34.0  )
Supriya sule: ఢిల్లీకి వెళ్లని అజిత్ దాదా మాత్రమే తెలుసు.. సుప్రియా సూలే
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే తన సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అజిత్ ఇటీవల తరచూ ఢిల్లీకి వెళ్లడంపై స్పందించిన ఆమె.. దేశ రాజదానికి వెళ్లని అజిత్ మాత్రమే తనకు తెలుసని ఎద్దేవాచేశారు. బుధవారం ఆమె బారామతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అజిత్ ఢిల్లీ పర్యటనపై అడిగిన ప్రశ్నకు సుప్రియా బదులిచ్చారు. ‘ఢిల్లీకి వెళ్లడానికి ఇష్టపడని ఒక అజిత్ దాదా మాత్రమే నాకు గుర్తున్నారు. నెలరోజులుగా ఆయనతో టచ్‌లో లేను. కాబట్టి అజిత్ ఢిల్లీకి ఎందుకు వెళ్లాడో నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. కాగా, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్, ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్‌తో కలిసి మంగళవారం న్యూఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనను ఉద్దేశించే సుప్రియా పై విధంగా స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed