డ్రాగా ముగిసిన చివరి టెస్ట్.. సిరీస్‌ 2-1తో టీమ్‌ ఇండియా కైవసం

by Vinod kumar |   ( Updated:2023-03-13 16:21:06.0  )
డ్రాగా ముగిసిన చివరి టెస్ట్.. సిరీస్‌ 2-1తో టీమ్‌ ఇండియా కైవసం
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ టెస్టు చివరికి డ్రాగా ముగిసింది. ఐదో రోజు, సోమవారం 3/0తో ఆట మొదలు పెట్టిన ఆస్ట్రేలియా మూడు సెషన్లూ ఆడగా.. 78.1 ఓవర్లకు 175/2తో నిలిచింది. మార్నస్‌ లబుషేన్‌ (63; 213 బంతుల్లో 7x4), స్టీవ్‌ స్మిత్‌ (10; 59 బంతుల్లో 2x4) అజేయంగా నిలిచారు. అయితే ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు ముందుగానే మాట్లాడుకుని కరచాలనం చేసుకున్నారు.

ఇందుకు అంపైర్లు అంగీకరించారు. దీంతో టీమ్‌ఇండియా ఈ సిరీసును 2-1 తేడాతో గెలిచింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. మరికొన్ని రోజుల్లోనే టీమ్‌ ఇండియా, ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌లో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్లో తలపడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed