- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
IND vs PAK : క్రికెట్ ఫ్యాన్స్కు బిగ్ షాక్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రీషెడ్యూల్!
న్యూఢిల్లీ : ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నది. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్ మొదలు కానున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. భద్రతా కారణాల రీత్యా ఈ మ్యాచ్ను రీషెడ్యూల్ చేయాలని భద్రతా సంస్థలు బీసీసీఐని కోరినట్టు ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న భారత్, పాక్ జట్లు తలపడాల్సి ఉండగా.. అదేరోజు గుజరాత్ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.
భారత్, పాక్ మ్యాచ్కు భారీగా అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉండటం, మరోవైపు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకావడంతో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐకి తెలిపినట్టు ఆ మీడియా సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ మ్యాచ్లు నిర్వహించే రాష్ట్ర అసోసియేషన్లతో బీసీసీఐ సెక్రెటరీ జైషా నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్పై చర్చించి కొత్త తేదీని నిర్ణయించే అవకాశం ఉంది. షెడ్యూల్ చేసిన తేదీ కంటే ఒక రోజు ముందు అంటే అక్టోబర్ 14న మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.