Dinesh Karthik : దినేశ్ కార్తీక్ యూటర్న్.. ఆ జట్టు తరఫున రీ ఎంట్రీ

by Harish |
Dinesh Karthik : దినేశ్ కార్తీక్ యూటర్న్.. ఆ జట్టు తరఫున రీ ఎంట్రీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ప్రొఫెషనల్ క్రికెట్‌ రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌తో సహా అన్ని ఫార్మాట్లకు అతను గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్న దినేశ్ కార్తీక్ తిరిగి బ్యాటు పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. సౌతాఫ్రికా వేదికగా జరిగే ఎస్‌ఏ20 లీగ్‌లో ఆడబోతున్నాడు.

ఈ మేరకు పార్ల్ రాయల్స్ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. సౌతాఫ్రికా లీగ్‌లో ఆడబోతున్న తొలి భారత క్రికెటర్‌గా దినేశ్ కార్తీక్ నిలబోతున్నాడు. ఎస్‌ఏటీ20 లీగ్‌ అంబాసిడర్‌గా నియామకమైన మరుసటి రోజే దినేశ్ కార్తీక్ ప్లేయర్‌గా పార్ల్ రాయల్స్‌తో ఒప్పందం చేసుకోవడం గమనార్హం.

పార్ల్ రాయల్స్ జట్టులో చేరడంపై కార్తీక్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘సౌతాఫ్రికాలో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకే, ఆ అవకాశం రాగానే నో చెప్పలేకపోయా. పోటీ క్రికెట్‌లోకి తిరిగి రావడం ఎంతో ప్రత్యేకం. అనుభవం, నాణ్యత, సామర్థ్యం ఉన్న పార్ల్ రాయల్స్ జట్టులో చేరినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఎస్‌ఏ20 లీగ్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed