కెనడా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గాయత్రి జోడీ

by Harish |
కెనడా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గాయత్రి జోడీ
X

దిశ, స్పోర్ట్స్ : కెనడాలో జరుగుతున్న కెనడా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ ఉమెన్స్ సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో గాయత్రి జోడీ 17-21, 21-7, 21-8 తేడాతో ఆంథోనిసెన్(డెన్మార్క్)-అలీస్సా టిర్టోసెన్టోనో(నెదర్లాండ్స్) జంటపై విజయం సాధించింది. తొలి గేమ్‌ను కోల్పోవడంతో మొదట భారత ద్వయానికి శుభారంభం దక్కలేదు. కానీ, ఆ తర్వాత బలంగా పుంజుకుని దూకుడుగా ఆడింది. దీంతో ప్రత్యర్థుల వద్ద సమాధానమే లేదు. ఏకపక్షంగా మిగతా రెండు సెట్లను నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో చైనీస్ తైపీకి చెందిన హ్సీ పెయ్ షాన్-హంగ్ ఎన్ ట్జు జంటతో గాయత్రి జోడీ తలపడనుంది.

మెన్స్ సింగిల్స్‌లో యువ ఆటగాడు ప్రియాన్షు రజావత్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు రెండో రౌండ్‌లో ప్రియాన్షు 21-19, 21-11 తేడాతో జపాన్ ప్లేయర్ టకుమా ఒబయాషిని ఓడించాడు. క్వార్టర్స్‌లో అతనికి కఠిన ప్రత్యర్థి ఎదురయ్యాడు. వరల్డ్ నం.4 అండర్స్ ఆంటోన్సెన్(డెన్మార్క్)తో తలపడనున్నాడు. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయ, తన్య హేమంత్, పురుషుల డబుల్స్‌లో సాయి ప్రతీక్, కృష్ణ ప్రసాద్ రెండో రౌండ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించారు.

Advertisement

Next Story

Most Viewed