బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపీక.. ఐపీఎల్ స్టార్లకు అవకాశం

by Mahesh |
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపీక.. ఐపీఎల్ స్టార్లకు అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియా లో భాగంగా ఇరు దేశాల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. కాగా దీని అనంతరం మరో టెస్ట్ ఉండగా.. ఆ తర్వాత భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బీసీసీఐ భారత టీ20 జట్టును ప్రకటించింది. కాగా ఈ జట్టులో హర్దిక్ పాండ్యా మినహా పూర్తిగా యువ ప్లేయర్లకు అవకాశం దక్కింది. ముఖ్యంగా 2024 ఐపీఎల్ లో సత్తా చాటిన యువ ప్లేయర్లకు అవకాశం దక్కగా.. సూర్యకుమార్ యాదవ్ కు మరోసారి కెప్టెన్సీ భాద్యతలను అప్పగించారు. మొత్తం 15 మంది ప్లేయర్లతో బీసీసీఐ టీ20 జట్టును ప్రకటించింది. ఇందులో బ్యాటర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(WK), హర్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్(C) రియాన్ పరాగ్ లకు చోటు దక్కగా.. ఆల్ రౌండర్ కోటాలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్ లకు అవకాశం కల్పించారు. అలాగే స్పిన్నర్ల కోటాలో రవి బిశ్నోయ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. అలాగే ఫాస్ట్ బౌలర్లుగా జితేష్ శర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ చోటు దక్కించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed