- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Ashes 2023: ఆసీస్తో రెండో టెస్ట్ ఆడే ఇంగ్లండ్ తుది జట్టు ఇదే
దిశ, వెబ్డెస్క్: యాషెస్ సిరీస్ను ఓటమితో ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. బజ్బాల్ కాన్సెప్ట్తో తొలి టెస్ట్లో ఓటమిపాలైన బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్.. లార్డ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమై రెండో టెస్ట్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక రెండో టెస్ట్ బరిలోకి దిగే తమ తుది జట్టును ఇంగ్లండ్ ఒక రోజు ముందుగానే ప్రకటించింది. ఫైనల్ ఎలెవన్లో ఒకే ఒక మార్పు చేసిన ఇంగ్లండ్.. వెటరన్ స్పిన్నర్ మొయిన్ అలీని తప్పించి యువ పేసర్ జోష్ టంగ్ను తీసుకుంది.
సుదీర్ఘ కాలం తర్వాత బెన్ స్టోక్స్ రిక్వెస్ట్తో టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చిన మొయిన్ అలీ రెండో మ్యాచ్కే దూరం కావాల్సి వచ్చింది. తొలి టెస్ట్ సందర్భంగా అతని బౌలింగ్ ఫింగర్కు గాయం కావడంతో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. జట్టులోకి వచ్చిన జోష్ టంగ్.. గత నెలలో ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్ట్లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
యాషెస్ రెండో టెస్ట్ ఇంగ్లండ్ తుది జట్టు:
బెన్ డక్కెట్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్స్టో, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, జేమ్స్ అండర్సన్
📋 We can confirm our team for the second Ashes Test match at Lord's.
— England Cricket (@englandcricket) June 27, 2023
Congratulations, Josh Tongue 🤝 #EnglandCricket | #Ashes