భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా అజయ్ రాత్రా

by M.Rajitha |
భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా అజయ్ రాత్రా
X

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు బీసీసీఐ(BCCI) భారత క్రికెట్ జట్టుకు సెలెక్షన్ కమిటీ సభ్యున్ని నియమించింది. భారత జట్టు మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా(Ajay Ratra)ను నియమిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. అజిత్ అగార్కర్ సారథ్యంలో అజయ్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. కాగా అజయ్ రాత్రా భారత జట్టుకు వికెట్ కీపర్ గా, బ్యాట్స్ మెన్ గా ఆరు టెస్టులు, పన్నెండు వన్డే మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉందని బీసీసీఐ పేర్కొంది. దాదాపు నాలుగు వేల పరుగులు, 240 వికెట్లు తీసిన రికార్డ్ అజయ్ కి ఉంది. అలాగే అస్సాం, పంజాబ్, యూపీకి హెడ్ కోచ్ గా సేవలు అందించాడు.

Next Story

Most Viewed