బయలు దేరిన స్పెషల్ ఫ్లైట్!.. రేపు తెల్లవారుజామున కప్పుతో స్వదేశానికి చాంపియన్స్

by Ramesh Goud |
బయలు దేరిన స్పెషల్ ఫ్లైట్!..  రేపు తెల్లవారుజామున కప్పుతో స్వదేశానికి చాంపియన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లు కప్పుతో రేపు ఉదయం స్వదేశంలో అడుగుపెట్టనున్నారు. బెరిల్ తుఫాన్ ఫ్రభావంతో ఇండియా క్రికెటర్లు బార్బడోస్ లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వీరిని ఇండియాకు తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీరి కోసం స్పెషల్ ఫ్లైట్ ను బార్బడోస్ విమానాశ్రయానికి పంపింది. బార్బడోస్ నుంచి బయలుదేరిన ఈ స్పెషల్ ఫ్లైట్ టీమిండియా ఆటగాళ్లతో పాటు అక్కడే చిక్కుకున్న భారతీయ మీడియా సభ్యులను కూడా తీసుకొని వస్తుంది. ఈ బ‌‌‌‌‌‌ృంధం జూలై 4న తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోనుందని బీసీసీఐ వర్గాల సమాచారం. ఇండియాలో అడుగుపెట్టిన అనంతరం క్రికెటర్ల బృంధం ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది. ఇక వరల్డ్ కప్ తో స్వదేశంలో అడుగుపెట్టనున్న ఇండియా చాంపియన్స్ కి ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు సిద్దంగా ఉన్నారు.

Next Story