దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా 4 లక్షలు దాటిన కేసులు

by vinod kumar |
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండటంతో సామాన్య జనాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,14,188 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వైరస్ బారినపడి 3,915 మంది మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,14,91,598 చేరగా, మరణాల సంఖ్య 2,34,083కు పెరిగింది. అయితే గత పది రోజుల నుంచి వరుసగా రోజు 3 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం, ఇక రెండు, మూడు రోజుల నుంచి 4 లక్షలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. కేసులతో పోలిస్తే రివకరీ కేసులు కూడా చాలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 3,31,507 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,76,12,351కి చేరింది. ప్రస్తుతం దేశంలో 35,45,164 క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed