ఏపీలో ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల

by srinivas |
ఏపీలో ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించింది. విద్యార్థులు ‘https:bie.ap.gov.in’ ద్వారా తమ ఫలితాలను చూసుకోవడంతోపాటు షార్ట్ మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ‘[email protected]” ద్వారా లేదా 391282578 వాట్సాప్‌ నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 వరకు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే రీ కౌంటింగ్‌కు రూ. 260, రీ వాల్యుయేషన్, స్కాన్ కాపీని పొందేందుకు రూ. 1300 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed