ఐడీఏ బొల్లారంలో పేలిన రియాక్టర్

by Sumithra |
ఐడీఏ బొల్లారంలో పేలిన రియాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వింధ్యా ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ లోపల ఉన్న 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి చాలా మంది కార్మికులు పరుగులు తీశారు.

Advertisement

Next Story

Most Viewed