రవీంద్ర జడేజా వారితో చేరిపోయాడు

by Shiva |
రవీంద్ర జడేజా వారితో చేరిపోయాడు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా గాయం కారణంగా కొంత కాలంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకున్న రవీంద్ర జడేజా ఇటీవలే ఫిట్‌నెస్ కూడా సాధించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న జడేజా శుక్రవారం ముంబయిలో జట్టుతో కలిశాడు. ఫస్ట్ లెగ్‌లో సీఎస్కే మ్యాచ్‌లు ముంబయిలో జరుగుతుండటంతో కెప్టెన్ ధోనీ సహా మిగతా జట్టు సభ్యులు చెన్నై నుంచి ముంబయికి చేరుకున్నారు. గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా సహా, సురేష్ రైనా జట్టుతో చేరినట్లు సీఎస్కే తెలిపింది. సురేష్ రైనా, డ్వాన్ బ్రావో ప్రస్తుతం ముంబయిలోని ట్రైడెంట్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. రాయుడు, రుతురాజ్ గైక్వాడ్ గురువారమే జట్టుతో చేరారు. క్వారంటైన్ ముగిసిన తర్వాత ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండో దఫా ట్రైనింగ్ క్యాంప్ మొదలయ్యే అవకాశం ఉన్నది.

Next Story