- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విపక్షాల విభజించి పాలించే ఎత్తుగడలు చెల్లవు.. ఎంపీ విజయసాయిరెడ్డి

X
దిశ, ఏపీ బ్యూరో: ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి విభజించి పాలించే ఎత్తుగడలను ఇప్పుడు విపక్షాలు అనుసరిస్తే చెల్లవని ఎంపీ విజయసాయిరెడ్డి హితవు పలికారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. నాడు బ్రిటిష్ పాలకులు కొన్ని కులాలను రెచ్చగొట్టేది. కొన్ని వెనుకబడిన, అణగారిన వర్గాలను మరింతగా తొక్కేసేది. రాజధానిలో వారుండరాదు. ఉంటే అడవుల్లో లేక ఊరవతల ఉండాలనే విధానం బ్రిటిష్ పాలకులది. ఆ అవశేషాలను ఇప్పుడు ఏపీలోని విపక్షాల్లో కనిపిస్తున్నాయంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 1947కు ముందు ఇవన్నీ చెల్లుబాటయ్యాయి. ఇప్పుడు వీలుకాదంటూ ఆయన రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాల గురించి పరోక్షంగా విపక్షాలకు చురకలు వేశారు.
Next Story