పల్నాడు వైసీపీ కార్యాలయానికి నోటీసులు

by Indraja |
పల్నాడు వైసీపీ కార్యాలయానికి నోటీసులు
X

దిశ, నరసరావుపేట: వైసీపీ అధికారంలో ఉండగా రాష్ర్టంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ నిర్మాణాలను చేపట్టి పూర్తి చేసింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యాలయాలకు ప్రభుత్వపరంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని, వాటికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు.. లింగంగుంట్ల అగ్రహారంలో నిర్మించిన వైసీపీ ఆఫీసుకు సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షుడికి నోటీసులు జారీ చేశారు. ఎవరూ అందుబాటులో లేకపోవటంతో కార్యాలయానికి నోటీసులు అంటించారు. దీనిపై వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఈ అక్రమ నిర్మాణాన్ని త్వరలోనే పుడా అధికారులు కూల్చనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed