కనక దుర్గ వారధి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..!

by  |
కనక దుర్గ వారధి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..!
X

దిశ వెబ్ డెస్క్: కనకదుర్గ వారధిపై నుంచి ఓ వ్యక్తి నదిలో దూకారు. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…పూజ చేసుకుంటానని చెప్పి కనకదుర్గ వంతెనపైకి తాడిగడపకు చెందిన మన్నే దుర్గా ప్రసాద్ వెళ్లారు. పూజ చేస్తుండగా వీడియోలు తీయాలని అతని తమ్ముడు కొడుకుతో చెప్పి ఆయన వెళ్లాడు. ఆ తర్వాత వారధిపై నుంచి నీటిలో దూకాడు. కాగా గల్లంతైన దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు అతను సూసైడ్ నోట్‌లో రాశాడు.


Next Story

Most Viewed