ఓటీటీలోకి బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల

by Hamsa |
ఓటీటీలోకి బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఈ సినిమాకు కళ్యాణ్ కార్య దర్శకత్వం వహించగా.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబితా నిర్మించింది. అయితే ఇందులో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్మ పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రలో కనిపించారు. మారుతీ నగర్ సుబ్రమణ్యం ఆగస్టు 23న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ప్రేక్షకులను నవ్వించి ఈ ఏడాదిలో వచ్చిన సినిమాల్లో ఇది బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

తాజాగా, మారుతీ నగర్ సుబ్రమణ్యం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. దీని ఓటీటీ హక్కుల్ని ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీ కూడా వచ్చేసింది. మారుతీ నగర్ సుబ్రమణ్యం సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ఆహా అనౌన్స్‌ చేసింది. ‘‘మీకు అవసరమైన నవ్వు థెరపీని మేము పొందాము! ఈ సంవత్సరం అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఆహాలో చూడండి’’ అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed