ఇరు‌దేశాల మధ్య రెండు రైళ్ల పరుగులు..!

by  |
ఇరు‌దేశాల మధ్య రెండు రైళ్ల పరుగులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా, నేపాల్‌ దేశాల మధ్య రెండు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు నడవనున్నాయని భారతీయ రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించి రెండు ‘డీజిల్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్’ రైళ్లను నేపాల్‌కు భారత్ అందజేసింది.

రానున్న డిసెంబర్ నెల నుంచి ఈ రైళ్లు బీహార్‌లోని జయనగర్, నేపాల్‌లోని ధనుసా జిల్లాల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ ప్రయత్నం వలన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఇరుదేశాల ప్రతినిధులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed