గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి : గడ్డం సీతా రెడ్డి

by Disha Web Desk 11 |
గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి : గడ్డం సీతా రెడ్డి
X

దిశ, ప్రతినిధి వికారాబాద్ : జిల్లా ప్రజలందరికీ సుపరిచితుడైన, పిలిస్తే పలికే నాయకుడు గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి గడ్డం సీతా రెడ్డి వికారాబాద్ ప్రజలను కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి గడ్డం సీతారెడ్డితో కలిసి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డిలు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన రంజిత్ రెడ్డికి వేసి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని గడ్డం సీతారెడ్డి వికారాబాద్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ మాట్లాడుతూ… కరోనా సమయంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నేనున్నానని ఆదుకున్న గొప్ప వ్యక్తి గడ్డం రంజిత్ రెడ్డి. అలాంటి మంచి వ్యక్తిని మరోసారి ఎంపీగా గెలిపించుకుంటే వికారాబాద్ పట్టణం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు. మరి ముఖ్యంగా మన వికారాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నేడు తెలంగాణ శాసనసభాపతిగా ఉన్నారు.

అలాగే మన జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వీరితోపాటు ఇప్పుడు ఎంపీని కూడా మన పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపించుకుంటే ముగ్గురు కలిసి వికారాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తారు. కాబట్టి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ, వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాలే లక్ష్మణ్ గుప్త, కౌన్సిలర్లు మాలే గాయత్రి లక్ష్మణ్, మోముల స్వాతి రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మోముల రాజ్ కుమార్, భరత్ రెడ్డి, సరాప్ సాయి కృష్ణ, సందీప్, పల్లవి, మేఘమాల తదితరులు పాల్గొన్నారు.



Next Story