'సరైన కారణం లేకుండా వేరు కాపురానికి వెళ్లడం సరికాదు'.. ఢిల్లీ హైకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు

by Vinod kumar |
సరైన కారణం లేకుండా వేరు కాపురానికి వెళ్లడం సరికాదు.. ఢిల్లీ హైకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ : సరైన కారణం లేకుండానే.. అత్తమామలకు దూరంగా వేరు కాపురం పెట్టాలంటూ భర్తపై అదేపనిగా భార్య ఒత్తిడిని పెంచడం క్రూరమైన చర్యే అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కన్నవారిని వదిలేయాలని ఈవిధంగా భర్తతో భార్య పట్టుబట్టడం సరికాదని స్పష్టం చేసింది. జస్టిస్ సురేశ్ కుమార్ కైట్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వేరు కాపురం కోసం తనను వేధించిన భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్ కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. తన పట్టుదలే నెగ్గాలనే వైఖరితో గత 16 ఏళ్లుగా ( 2007 నుంచి) పుట్టింటిలో ఉంటున్న భార్య నుంచి అతడికి విడాకులను మంజూరు చేయడమే కాక, ఆ వివాహాన్ని కూడా న్యాయస్థానం రద్దు చేసింది. వేరు కాపురానికి నో చెప్పిన భర్తతో ఇక కలిసి జీవించలేనని ఆ భార్య కోర్టుకు తెలిపింది.

దీంతో వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ‘ఒక వ్యక్తి తన కుటుంబంలో భార్యకు ఎంత గౌరవం ఇస్తాడో.. అంతే గౌరవాన్ని తల్లిదండ్రులకు, ఇతర తోబుట్టువులకు కూడా ఇస్తాడు. అలాంటి తల్లిదండ్రులను వయసుపైబడిన దశలో వదిలేసి.. భార్యతో కలిసి వెళ్లిపోవడం న్యాయం కూడా కాదు. అది హిందూ పరంపరకు కూడా విరుద్ధం. వేరు కాపురానికి వెళ్లడానికి సరైన కారణం ఏదైనా ఉండాలి’ అని బెంచ్ వ్యాఖ్యానించింది.

Advertisement

Next Story