- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Uttarakhand rains: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన వాహనం
తెహ్రీ (ఉత్తరాఖండ్) : ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో ఉన్న శ్రీనగర్- బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి.. గులార్ గ్రామం వద్ద రోడ్డు మీద నుంచి లోయలోకి పడిపోయింది. రెస్క్యూ సిబ్బంది ఐదుగురిని రక్షించారు. వాహన డ్రైవర్ సహా ఆరుగురు గల్లంతయ్యారు. మిస్సయిన వాళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన జే. రవిరావు కూడా ఉన్నారు. అయితే ఆయన భార్య కళ్యాణిని రెస్క్యూ టీమ్ రక్షించి రిషికేశ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించింది.
గల్లంతైనవారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పర్వతాల మీద నుంచి బండరాయి ఒక్కసారిగా రోడ్డుపైకి దొర్లుకుంటూ వచ్చిందని.. ఆ బండరాయిని తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పి లోయలోని నదిలోకి పడిపోయిందని అంటున్నారు. ప్రయాణికులు సోన్ప్రయాగ్ నుంచి రిషికేశ్కు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని సమాచారం. మరోవైపు భారీ వర్షాల కారణంగా కల్కా-సిమ్లా మార్గంలో రైల్వే ట్రాక్ ను మూసివేశారు. నైరుతి రుతుపవనాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.