పుట్ట గొడుగులు తిని ముగ్గురు పిల్లలు మృతి..మేఘాలయాలో ఘటన

by vinod kumar |
పుట్ట గొడుగులు తిని ముగ్గురు పిల్లలు మృతి..మేఘాలయాలో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: మేఘాలయలోని వెస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టగొడుగులు తిని ఇద్దరు పిల్లలు మృతి చెందగా..మరి కొందరు అస్వస్థతకు గురయ్యారు. జైంతియా హిల్స్ ఎస్పీ చెంపాంగ్ సిర్టి తెలిపిన వివరాల ప్రకారం..సెఫాయ్ గ్రామంలోని ఓ మూడు కుటుంబాలు పుట్టగొడుగులు తిన్నారు. ఈ క్రమంలోనే వారంతా అస్వస్థతకు గురయ్యారు. అనంతరం వీరిని చికిత్స నిమిత్తం జోవాయిలోని ప్రభుత్వ ఎంసీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో పరిస్థితి విషమించి ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిని వాన్సాలన్ సుచియాంగ్ (14), కిట్లాంగ్కి సుచియాంగ్ (10), రివాంక సుచియాంగ్ (8)గా గుర్తించారు. మిగతా కుటుంబ సభ్యుల్లోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్పీ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed